మామిడికోళ్ళ గ్రామ పెద్దలు చెప్పిన ప్రకారము, శ్రీ వీరమ్మ తల్లి గత 115 సంవత్సరములుగా మామిడికోళ్ళ గ్రామము నందు వెలసియున్నది. శ్రీ తోట భద్రయ్య (దేవుడు భద్రయ్య) గారు అను మామిడికోళ్ళ గ్రామ వాసి పనుల నిమిత్తము మామిడికోళ్ళ ప్రక్క గ్రామము అయిన పెరిసేపల్లి గ్రామము నకు వెళ్ళి వచ్చుచున్నపుడు (సుమారుగా 1910 సం న) ఆయన 15 సం వయసు నందు శ్రీ వీరమ్మ తల్లి ఆవహించినది అనియు, ఆయన లంకాదొడ్డి గ్రామము దాటుచున్నపుడు స్పృహ తప్పి, గుడిసె ఇంటి పేరు గల వారి (పెద్ద గోవిందు, చిన్న గోవిందు) ఇంటి ముందు పడి పోయినాడు అనియు, వారు ఇంట్లోకి తీసుకుని వెళ్ళి సపర్యలు చేసి నపుడు, దేవుడు భద్రయ్య గారు లేచి, నన్ను శ్రీ వీరమ్మ తల్లి ఆవహించి యున్నది అని చెప్పి, ఆ పూనకము నందు నన్ను (శ్రీ వీరమ్మ తల్లి) మామిడికోళ్ళ గ్రామమున ప్రతిష్టించమనియు, మరియు పుట్టినిల్లు వారిగా మీరు నాకు అన్ని ఆడపడుచు నకు జరుగు అన్ని కార్యక్రమములు మీ ఇంటి నుండి చూడమని ఆదేశించినది అనియు, కాలక్రమమున దేవుడు భద్రయ్య గారు ఇప్పుడు ఉన్న గుడి ప్రదేశమున ఉన్న ఇంటి నందు కాపురము ఉంటూ శ్రీ వీరమ్మ తల్లి భక్తులకు బండారి, తాళ్ళు శ్రీ వీరమ్మ తల్లికి వారి కోరికలు తీర్చమని నమస్కరించి భక్తులకు తగు సూచనలు ఇచ్చుచుండును. ఈ రోజు ఉదయము నుండి చెరువు నుంచి 101 బిందెలు నీళ్ళతో (పాలాభిషేకముతో) శ్రీ వీరమ్మ తల్లి గద్దె మరియు గుడి శుభ్రము చేయుట (మ్రొక్కు కున్న వారు కూడా) మరియు 101 బిందెలతో మామిడికోళ్ళ గ్రామమున వెలసి ఉన్న గ్రామ దేవత గంగానమ్మ తల్లి తలంటు స్నానము చేయుంచుట జరుగును. శ్రీ వీరమ్మ తల్లి గద్దె అలంకరించుట మరియు ఆ వారం నందు గుడి బయట తాటాకు పందిరి గ్రామ వాసులచే వేయడం మొదలగు పనులు జరుగును.
మామిడికోళ్ళ గ్రామమున 2010 వ సం నందు శ్రీ వీరమ్మ తల్లి అన్న సమారాధన కమిటీ ఏర్పడి, శ్రీ వీరమ్మ తల్లి సందర్శించు భక్తులకు ఎంతమంది వచ్చినను ఆ రాత్రి భోజన సదుపాయం లేదని అనకుండా అన్నదానము (భక్తుల విరాళాల తో) చేయుచున్నారు. 1100 మందితో ప్రారంబించబడి ఇప్పటి వరకు (2020, 2021 మినహా, కరొన సందర్బంగా) అప్రతిహారంగా సుమారుగా 4000 మంది భక్తులు భోజనాలు చేయుట జరుగు చున్నవి.
సమాచారం ఇచ్చినవారు
గ్రామ పెద్దలు